సినిమా వార్తలు

తెలుగువన్ ప్రొడక్షన్స్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్.. దర్శకుడిగా మారుతున్న రవిశంకర్ కంఠంనేని

Published by
Srinivas

2024లో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన TeluguOne సంస్థ ఇప్పుడు తన రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.

రైతుల సమస్యలను ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన తొలి చిత్రం “రాజధాని ఫైల్స్” మంచి స్పందన అందుకుంది. ఆ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

తెలుగువన్ అధినేత Ravishankar Kantamaneni తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆయనే నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు.

పంచభూతాలను ప్రధాన కథా నేపథ్యంగా తీసుకుని, దాన్ని విస్తృత స్థాయిలో ఆవిష్కరిస్తూ ఒక భారీ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా జరిగిన వేడుకలో పలువురు అతిథులు పాల్గొని రవిశంకర్ కంఠంనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Ramesh కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, తెలుగువన్ ప్రొడక్షన్స్ రెండో చిత్రం ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రానికి ప్రముఖ రచయిత Janardhana Maharshi కథ, రచన అందిస్తున్నారు. రచయితగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న జనార్థన మహర్షి ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి ఆసక్తిని పెంచుతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం మరియు ఇతర పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు రవిశంకర్ కంఠంనేని వెల్లడించారు.

తెలుగువన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రాన్ని కె. హిమబిందు సమర్పిస్తుండగా, వై. జతిన్ కుమార్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.