ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మహాకాళి’పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్కేడీ స్టూడియోస్, ప్రశాంత్ వర్మ సంయుక్తంగా అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టారికల్ స్పెక్టకిల్కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ‘శుక్రాచార్యాస్ వార్క్రై’ పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్తో పాటు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
‘మహాకాళి’ 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
2 నిమిషాల 55 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ సినిమా కథా ప్రపంచంపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ధర్మం, అధర్మం మధ్య జరిగే ఓ మహా సంఘర్షణకు గ్లింప్స్ తెరలేపింది. దేవతా శక్తులు, అసుర శక్తులు తలపడుతున్నట్లు చూపించిన ఈ వీడియో.. ఇది కేవలం మంచి-చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచం భవితవ్యాన్ని నిర్ణయించే మహాయుద్ధానికి నాంది అని సూచిస్తోంది.
అసురుల గురువు శుక్రాచార్యుడి నేతృత్వంలో ఈ యుద్ధం మరింత భీకరంగా మారబోతున్నట్లు గ్లింప్స్ హింట్ ఇచ్చింది. చీకటి వాతావరణం, యుద్ధానికి సిద్ధమవుతున్న శక్తులు, భారీ విజువల్స్తో “ది ఎండ్ బిగిన్స్” అంటూ ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.
గ్లింప్స్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. శుక్రాచార్యుడిగా ఆయన పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. గంభీరమైన చూపులు, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆయన పాత్రకు ప్రత్యేకమైన గ్రావిటీని తీసుకొచ్చారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్తో శుక్రాచార్యుడి పాత్రపై భారీ ఆసక్తి నెలకొనగా, ఈ గ్లింప్స్లో ఆయన పాత్రను మరింత విస్తృతంగా చూపించారు. ధర్మం-అధర్మం మధ్య జరిగే యుద్ధంలో శుక్రాచార్యుడి పాత్ర ఎంత కీలకంగా ఉండబోతుందనే విషయంపై గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని పెంచింది.
‘మహాకాళి’లోని అద్భుతమైన విజువల్ వరల్డ్ను కూడా ఈ గ్లింప్స్లో ఆవిష్కరించారు. భారీ సెట్స్, విస్తృతమైన వరల్డ్ బిల్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను భారీ స్థాయి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
నటి శ్రీయా రెడ్డి కూడా గ్లింప్స్లో పవర్ఫుల్గా కనిపించారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైన మలుపులకు కారణం కానున్నట్లు వీడియో సూచిస్తోంది. సినిమా ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో మేకర్స్ చూపించిన డీటెయిలింగ్ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తోంది.
‘హనుమాన్’తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కు బలమైన పునాది పడింది. భారతీయ ఇతిహాసాలు, పురాణాల నుంచి స్ఫూర్తి తీసుకుని వాటిని అత్యంత భారీ విజువల్ స్కేల్లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ప్రశాంత్ వర్మ చేస్తున్నారు. ఇప్పుడు ‘మహాకాళి’ ఆ విజన్ను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లబోతున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
ఆర్కే దుగ్గల్ సమర్పణలో, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాటిక్ యూనివర్స్ను సృష్టిస్తున్నారు.
అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డితో పాటు భూమి శెట్టి, రోహిత్ సరోఫ్ తదితర ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ విజువల్స్, పురాణ నేపథ్యం, ధర్మం-అధర్మం మధ్య మహాయుద్ధం, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రతో ‘మహాకాళి’పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా 2027 జనవరి 8న థియేటర్లలోకి రానుంది.