సినిమా వార్తలు

రూమర్లకు తెరదించిన సాయి దుర్గ తేజ్!

Published by
Srinivas

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రంపై వస్తున్న రూమర్స్‌కి ముగింపు పలికారు. ఆయన కొత్త సినిమాకు సంతకం చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ పూర్తిగా తన అంబిషస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల యెటి గట్టు (SYG)’పై దృష్టి సారించారు.

సాయి దుర్గ తేజ్ టీమ్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, సినిమా గురించి వచ్చే రూమర్స్‌కి నమ్మకండి, అధికారిక అప్‌డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది.

‘సంబరాల యెటి గట్టు’ ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సాయి దుర్గ తేజ్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని మాస్ అవతారంలో కనిపించనున్నారు.

₹125 కోట్లు భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకి హైలైట్‌గా నిలిచే పీటర్ హైన్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లో సాయి దుర్గ తేజ్‌కి ఓ బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రతినాయకుడిగా ఎదురవుతారని సమాచారం.

ఇప్పటికే విడుదలైన “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కడీ” మరియు “సంబరాల యెటి గట్టు కార్నేజ్” వీడియోలు సోషల్ మీడియాలో భారీ వైరల్ అయ్యాయి. వాటి విజువల్స్, ఇన్‌టెన్స్ టోన్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా అక్టోబర్ 15న, సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “అసుర ఆగమనా గ్లింప్స్” వీడియోలో ఆయన పవర్ ఫుల్ కొత్త లుక్ అభిమానులను ఉత్సాహపరిచింది.

ఇప్పటివరకు సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం పూర్తయింది. ఇంకా రెండు షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. నిర్మాతలు ఈ చిత్రాన్ని 2026 తొలి లేదా రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని రోహిత్ కె.పీ దర్శకత్వం వహిస్తుండగా, కే. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డిలు ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts