తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్లోనూ సత్తా చాటుతోంది.
తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్మైషో (BMS)లో గంటకు 30 వేలకుపైగా టికెట్లు బుక్ అయిన తమిళ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది.
ఈ ఘనత సాధించిన 9వ తమిళ చిత్రంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు మరోసారి స్పష్టమయ్యాయి.
సూర్యకు ఉన్న క్రేజ్, సినిమాపై ప్రేక్షకుల్లో ఏర్పడిన ఆసక్తి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుక్మైషోలో గంటకు 30K+ టికెట్లు అమ్ముడవడం.. సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. థియేట్రికల్ రిలీజ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బుకింగ్స్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
సూర్య కెరీర్లో మరో భారీ విజయంగా నిలిచేందుకు ఈ చిత్రం దూసుకెళ్తుందా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.