ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తుది శ్వాస విడిచారు. 1970ల నుంచే ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొంటూ, న్యాయవాదిగా మరియు అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలందించారు. పరిపాలనపై లోతైన అవగాహన, రాజకీయ దూరదృష్టి ఆయనకు ప్రత్యేక స్థానం తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే, ఆయన కుమారుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మరియు మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ ఈ దుఃఖాన్ని అధిగమించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని కోరుతూ తన సానుభూతిని తెలియజేశారు.
నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శూన్యాన్ని మిగిల్చిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.