ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు లోకేష్ తెలిపారు.
సంజయ్ దత్ను “లెజెండరీ బాలీవుడ్ స్టార్”గా అభివర్ణించిన లోకేష్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో సినిమా షూటింగ్ల కోసం సింగిల్ విండో అప్రూవల్ సిస్టమ్ అమలు చేసే అంశంపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.
సినీ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ఏపీలో సమగ్ర ‘సినీ షూటింగ్ ఎకోసిస్టమ్’ నిర్మాణంపై ఉత్సాహంగా ఉన్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీ ఏర్పాటుతో పాటు వేగవంతమైన అనుమతుల ప్రక్రియ అమలు చేస్తే, దేశీయ-అంతర్జాతీయ చిత్రాల చిత్రీకరణకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ భేటీతో సినిమా రంగం మరియు ప్రభుత్వ మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.