మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ మరియు ఫస్ట్ షాట్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో నడిచే స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. భావోద్వేగాలు, మానవ విలువలు, కష్టపడి గెలిచే ఆత్మవిశ్వాసం… ఈ కథలో ప్రధానాంశాలుగా ఉంటాయని సమాచారం.
తాజాగా ‘పెద్ది’ టీమ్ శ్రీలంకలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. అక్కడ రామ్ చరణ్ – జాన్వి కపూర్లపై అందమైన లొకేషన్స్లో కొన్ని కీలక సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన బీహైండ్ ద సీన్స్ (BTS) ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, దర్శకుడు బుచ్చి బాబు సన అద్భుతమైన రైల్వే టన్నెల్ పక్కన చర్చలు జరుపుతున్న దృశ్యాలు చూడొచ్చు.
అంతేకాదు, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏ.ఆర్. రహ్మాన్ త్వరలోనే ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ను విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో హాట్గా మారింది. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న తన హైదరాబాద్ రెహమాన్ లైవ్ కచేరీ సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, సినిమా మ్యూజికల్ ప్రమోషన్కు అది ఒక గ్రాండ్ ఆరంభం అవుతుంది.
వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
గ్రామీణ వాతావరణంలో నడిచే భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’ ఇప్పటికే ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్గా నిలిచింది. చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.