
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న తీవ్ర గాయానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉన్న రశ్మిక, ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. వరుసగా యాక్షన్ సన్నివేశాలు, కఠినమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చేయడం వల్ల ఆమె హిప్ ప్రాంతంలోని టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
ఈ గాయం తీవ్రత వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి టెండన్ గాయాలు అత్యంత కఠినమైన శారీరక సాధన చేసే ప్రొఫెషనల్ అథ్లెట్లలో మాత్రమే కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం.
వైద్యుల సూచన మేరకు రశ్మిక ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెండన్ తిరిగి బలపడేందుకు ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా తప్పనిసరిగా చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్లకు హాజరుకావాలని వైద్యులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రశ్మిక మందన్న భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఒకేసారి నాలుగు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుండటంతో పాటు దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ గాయం కారణంగా ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు, అలాగే పలు వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
రశ్మిక త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లకు రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై చిత్ర బృందం లేదా రశ్మిక టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
