2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు క్వాష్ చేస్తూ తీర్పు వెలువరించింది.
ఏం జరిగింది?
2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులతో కలిసి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్కు విరుద్ధమని ఆరోపిస్తూ అప్పటి ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మోహన్ బాబు, విష్ణులతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
హైకోర్టు తిరస్కరించగా…
ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు తీర్పు
కేసు విచారించిన సుప్రీంకోర్టు, మోహన్ బాబు వాదనలను సమీక్షించింది. ఎఫ్ఐఆర్లో తగిన ఆధారాలు లేవని గమనించిన సుప్రీంకోర్టు, దానిని క్వాష్ చేస్తూ ఇద్దరికీ ఉపశమనం కల్పించింది. ఈ తీర్పుతో 2019 ఎన్నికల కాలం నాటి ఈ కేసు ముగిసినట్లైంది.