Download App

ఏపీలో పాస్టర్లకు క్రిస్మస్ కానుక… గౌరవ వేతనంగా రూ.50.10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

డిసెంబర్ 26, 2025 By Rahul N
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్టర్లకు శుభవార్త అందించింది. గౌరవ వేతనం కింద పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.50.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం నవంబర్ వరకు గల 12 నెలల కాలానికి గాను, నెలకు రూ.5,000...
ఏపీలో పాస్టర్లకు క్రిస్మస్ కానుక… గౌరవ వేతనంగా రూ.50.10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్టర్లకు శుభవార్త అందించింది. గౌరవ వేతనం కింద పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.50.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం నవంబర్ వరకు గల 12 నెలల కాలానికి గాను, నెలకు రూ.5,000 చొప్పున 8427 మంది పాస్టర్ల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సహాయం ద్వారా పాస్టర్లకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

క్రైస్తవ మత గురువుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పండుగ వేళ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. సామాజిక సమానత్వం, మత సామరస్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది.

ఈ క్రిస్మస్ సందర్భంగా అందించిన గౌరవ వేతన కానుకపై పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading