ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత, సునామీ హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం శనివారం తెల్లవారుజామున భారీ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం ప్రభావంతో తూర్పు నుసా తెంగారా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. USGS వివరాల ప్రకారం.. భూకంపం దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. వరుసగా ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు భయంతో ఇళ్ల నుంచి […]
Read Moreసీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. అసైన్డ్ భూముల కేసు కొట్టివేత
అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దాన్ని కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం గానీ, అందుకు తగిన కారణాలు గానీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం […]
Read Moreప్రియాంక కుటుంబానికి జీఎస్ఎల్ కాలేజీ అండ.. రూ.20 లక్షల సాయం
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆమె కుటుంబానికి రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్ల్సపూర్లోని ప్రియాంక ఇంటికి కళాశాల యజమాని కుమారుడు తరుణ్, ఆయన భార్య సాధ్విక, ప్రిన్సిపాల్ సుభాషిణి బుధవారం వెళ్లారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి […]
Read Moreతెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత వ్యవస్థలో మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆగస్టు 15న శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజున రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ […]
Read More‘ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్బస్సు అవసరమా అన్నారు..’ – నారా లోకేష్
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. “ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది… ఒకప్పుడు ‘ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్బస్సు అవసరమా’ అంటూ ఈ ప్రాంతాన్ని అవమానించిన వారు ఉన్నారు. వారికి ఇదే మా సమాధానం. ఎర్రబస్సు కూడా రాదన్న చోటుకే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం […]
Read Moreభోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్రకు గర్వకారణమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, వేలాది మంది ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిసి సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం […]
Read Moreమెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రభుత్వం మండిపాటు
ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున చేపట్టిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై రాజకీయంగా జరుగుతున్న విమర్శలకు ప్రభుత్వం ఘాటుగా బదులిచ్చింది. మెగా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వేలాది మంది అభ్యర్థుల ప్రతిభను ప్రశ్నించేలా తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరణలో, మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సాంకేతిక ప్రమాణాలకు […]
Read Moreరాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న టీడీపీ 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో […]
Read Moreఆస్పత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో పరామర్శించారు. తన కొత్త సినిమా NBK111 షూటింగ్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. గాయానికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా, కొద్ది రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు […]
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. 9 సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గంటల పాటు శ్రమించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యురాలు […]
Read More