Download App

బండి భగీరథ్‌పై పోక్సో కేసుపై మంచు మనోజ్… “చట్టం ముందు అందరూ సమానులే”

మే 12, 2026 By Srinivas
హైదరాబాద్‌లో ఇటీవల నమోదైన పోక్సో కేసుపై సినీ నటుడు Manchu Manoj స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన ఈ కేసు తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికల రక్షణ కోసం తీసుకువచ్చిన #POCSO చట్టం...
బండి భగీరథ్‌పై పోక్సో కేసుపై మంచు మనోజ్… “చట్టం ముందు అందరూ సమానులే”

హైదరాబాద్‌లో ఇటీవల నమోదైన పోక్సో కేసుపై సినీ నటుడు Manchu Manoj స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన ఈ కేసు తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.

మైనర్ బాలికల రక్షణ కోసం తీసుకువచ్చిన #POCSO చట్టం ప్రతి పరిస్థితిలోనూ కచ్చితంగా అమలవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదని, రాజ్యాంగం ముందు ప్రతి బాలికకు సమాన న్యాయం దక్కాల్సిందేనని స్పష్టం చేశారు.

మైనర్లకు సంబంధించిన కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని, దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని మనోజ్ పేర్కొన్నారు. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత ధోరణి కనిపించినా ప్రజల న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలు అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని కోరారు.

“న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు ప్రజలకు స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు మరోసారి నిరూపించాలి” అని Manchu Manoj తన ప్రకటనలో పేర్కొన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading