గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా స్పెక్టకిల్ పెద్దిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఫస్ట్ షాట్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ సినీప్రియుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ అందించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన, మాస్ట్రో ఏఆర్ రహ్మాన్ స్టూడియోలో ఉన్న ఫోటోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ బ్లాక్బస్టర్ ఆల్బమ్ను కంపోజ్ చేశారు. ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పటికీ మరువలేని మ్యూజికల్ ట్రీట్గా పెద్ది పాటలు నిలుస్తాయని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ కీలక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ఎడిటింగ్ నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి అందిస్తున్నారు.
పెద్ది మార్చి 27, 2026న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది.