
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పటికే మంచి బజ్ను సొంతం చేసుకుంది. సమంత హీరోయిన్గా నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచగా, తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్తో మరో ఆకట్టుకునే అప్డేట్ను అందించారు.
‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటను పెళ్లి వేడుకల్లో మార్మోగేలా రూపొందించారు. రెహమాన్ సాహిత్యాన్ని అందించగా, చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించిన ఈ పాటకు సంతోష్ నారాయణన్ క్యాచీ ట్యూన్ ఇచ్చారు. ఉత్సాహభరితమైన బీట్స్, ఫెస్టివ్ వైబ్తో ఈ సాంగ్ వెంటనే ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో సమంత కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులు, స్టైలిష్ లుక్స్, క్లాసీ కొరియోగ్రఫీ కలిసి ‘తస్సాదియ్యా’ను పూర్తి విజువల్ ట్రీట్గా మార్చేశాయి.
‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి – సమంత కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. దీనికి తోడు రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ప్లే అందించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఫ్యామిలీ మొత్తం కలిసి ఆస్వాదించగల ఎంటర్టైనర్గా ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
