కోలీవుడ్లో ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘జో’ చిత్రంతో విశేష గుర్తింపు అందుకున్న విజన్ సినిమా హౌస్ తమ తదుపరి ప్రాజెక్ట్ అయిన ప్రొడక్షన్ నెంబర్ 3 ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు–తమిళ్ ద్విభాషా చిత్రంగా రూపొందనున్నది.
ఈ ప్రాజెక్ట్లో ప్రతిభావంతులైన నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగళ్’ వంటి చిత్రాలతో నటనలో మెప్పించిన ఏగన్, ‘కోర్ట్’ ద్వారా ప్రశంసలు పొందిన శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. నటీనటుల ఎంపికతోనే చిత్రంపై మంచి బజ్ నెలకొంది.
ఈ చిత్రానికి రీసెంట్ మ్యూజికల్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి చిత్రాలకు చార్ట్బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన విజయ్, ఈ ద్విభాషా చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారని మేకర్స్ ప్రకటించారు.
‘ఆహా కళ్యాణం’ చిత్రంతో దర్శకత్వం లో తనదైన ముద్ర వేసుకున్న యువరాజ్ చిన్నసామి ఈ కొత్త ప్రాజెక్ట్కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
‘జో’ విజయంతో కంటెంట్కు ప్రాధాన్యమిస్తూ కథా ప్రధాన చిత్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు.
సినిమా సంబంధిత మరిన్ని వివరాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది.