
దుల్కర్ సల్మాన్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా కాంత టీజర్తోనే సినీప్రేక్షకులలో పెద్ద అంచనాలు సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.
స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “హే పసి మనసే” వింటేజ్ రొమాన్స్ సారాన్ని అందిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఝాను చంతర్ ఆ కాలపు మెలోడీ మాధుర్యాన్ని పునఃసృష్టిస్తూ ఈ ట్రాక్ను స్వరపరిచారు. కృష్ణ కాంత్ రాసిన సాహిత్యం ప్రేమ ప్రయాణాన్ని హృద్యంగా అద్దిపుచ్చగా, ప్రదీప్ కుమార్ – ప్రియాంకా ఎన్కే వోకల్స్ పాటకు మరింత మాధుర్యాన్ని తెచ్చాయి.
రెట్రో మ్యూజిక్ థీమ్కు అనుగుణంగా సెట్లు, కాస్ట్యూమ్స్ అద్భుతంగా రూపుదిద్దుకుని ప్రేక్షకులను ఆ కాలపు వాతావరణంలోకి తీసుకెళ్తున్నాయి. దుల్కర్ – భాగ్యశ్రీ జంట తెరపై చూపించిన కెమిస్ట్రీ వింటేజ్ లవ్ స్టోరీకి జీవం పోసింది.
సినిమాటోగ్రఫీకి డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్కి థా. రామలింగం, అదనపు స్క్రీన్ప్లేకు తమిల్ ప్రభ, ఎడిటింగ్కు లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ పని చేస్తున్నారు.
కాంత సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.
