Download App

ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్విరాజ్ వైరల్ సెల్ఫీ

November 18, 2025 Published by Rahul N

ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్విరాజ్ వైరల్ సెల్ఫీ

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి సినిమా చుట్టూ హంగామా కొనసాగుతూనే ఉంది. గ్లింప్స్‌లో కనిపించిన గ్రాండ్ స్కేల్, విజువల్ స్పెక్టాకిల్, అద్భుత VFX లు ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశాయి. ఈవెంట్ ముగిసే నాటికి గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇలాంటి వేడి మధ్య, సినిమా టీమ్‌కి మరింత బజ్ తెచ్చింది ఒక వైరల్ సెల్ఫీ. అంతర్జాతీయ మీడియా అవుట్‌లెట్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన తరువాత, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్‌ను తనతో కలిసి ఒక క్విక్ సెల్ఫీకి పిలిచింది. సినిమాలో ప్రియాంక మందాకిని, ప్రిత్విరాజ్ కుంభ పాత్రల్లో కనిపించబోతున్నారు. ముగ్గురూ ఫార్మల్ అటైర్‌లో, గ్లోబల్ ప్రమోషన్‌కి తగిన ఎలిగెంట్ లుక్‌తో కనిపించడంతో ఆ సెల్ఫీ క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో పేలిపోయింది. అభిమానులు, ఫ్యాన్‌పేజీలు ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

mahesh babu, priyanka chopra, prithviraj in varanasi shoot

ఇకపోతే, టీమ్ తదుపరి చేసే ప్రమోషనల్ యాక్టివిటీలను గోప్యంగా ఉంచుతోంది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ ఈ చిత్రాన్ని అతి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సంగీత బాధ్యతలను ఎం.ఎం. కీరవాణి చూసుకుంటున్నారు. ప్రస్తుతం సమ్మర్ 2027లో విడుదల చేయాలన్న ప్రణాళిక ఉంది. అయితే షూటింగ్ పేస్‌ను బట్టి విడుదల తేదీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading