Download App

ఎట్టకేలకు జాహ్నవి కుటుంబానికి దక్కిన న్యాయం… అమెరికా పోలీస్ నిర్లక్ష్యానికి రూ.262 కోట్ల పరిహారం

ఫిబ్రవరి 12, 2026 By Rahul N
రెండేళ్ల కిందట అమెరికాలో జరిగిన దుర్ఘటనలో కర్నూలుకు చెందిన యువతి మృతి చెందగా, ఆమె కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 2023 జనవరిలో Seattle నగరంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి (23) అనే యువతిని వేగంగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది....
ఎట్టకేలకు జాహ్నవి కుటుంబానికి దక్కిన న్యాయం… అమెరికా పోలీస్ నిర్లక్ష్యానికి రూ.262 కోట్ల పరిహారం

రెండేళ్ల కిందట అమెరికాలో జరిగిన దుర్ఘటనలో కర్నూలుకు చెందిన యువతి మృతి చెందగా, ఆమె కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

2023 జనవరిలో Seattle నగరంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి (23) అనే యువతిని వేగంగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలోనే కాకుండా భారతీయుల మధ్య కూడా తీవ్ర ఆవేదన కలిగించింది.

ప్రమాదం అనంతరం సియాటెల్ పోలీస్ విభాగానికి చెందిన అధికారి Daniel Auderer చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి దారి తీశాయి. “ఆమె చనిపోయింది… ఆమె చాలా మామూలు మనిషి… 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది… హహహ” అంటూ నవ్వినట్లు వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ వ్యాఖ్యలు మానవత్వానికి విరుద్ధమని పలువురు ఖండించారు.

ఈ నేపథ్యంలో జాహ్నవి కుటుంబానికి సుమారు రూ.262 కోట్ల (డాలర్లలో భారీ సెటిల్‌మెంట్) పరిహారం ఇవ్వనున్నట్లు Seattle City Government ప్రకటించింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ మరణానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పరిహారం ప్రకటించినప్పటికీ, ఒక కుటుంబానికి జరిగిన అపార నష్టాన్ని అది భర్తీ చేయలేదని స్థానికులు భావిస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading