కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని.. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం, 15వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.
ఇక హడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి 11వేల కోట్లు ఇప్పించామని, పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా 12,157 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు మోదీ. ఇలా ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.