
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్ సీ లెంగ్ ముఖ్య ప్రకటన చేశారు. 2014–2019 మధ్యలో అమరావతి అభివృద్ధికి తమ సహకారం అందించామని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంతో సింగపూర్ కన్సార్టియం ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు మేము సిద్ధంగా ఉన్నాం,” అని మంత్రి ప్రకటించారు.
సింగపూర్ ప్రభుత్వ ఈ ప్రకటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను,” అని అన్నారు.
