Download App

అధికారం పోయినా అరాచకం తప్పలేదు

ఫిబ్రవరి 15, 2025 By Srinivas
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు చేసిన తప్పుల్ని ఎండగట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయినా, ఆ పార్టీ నేతల అరాచకాలు మాత్రం ఇంకా తగ్గలేదన్నారు బాబు.అందుబాటులో ఉన్న నేతలతో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సమావేశమయ్యారు చంద్రబాబు. ఉపాధ్యాయ, పట్టభధ్రుల ఎమ్మెల్సీ...

అధికారం పోయినా అరాచకం తప్పలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు చేసిన తప్పుల్ని ఎండగట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయినా, ఆ పార్టీ నేతల అరాచకాలు మాత్రం ఇంకా తగ్గలేదన్నారు బాబు.

అందుబాటులో ఉన్న నేతలతో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సమావేశమయ్యారు చంద్రబాబు. ఉపాధ్యాయ, పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరోసారి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టారు

జగన్ ఆటవిక రాజ్యంలో దాడులు, డ్రగ్స్, దౌర్జన్యాలు, హత్యలు ఎక్కువగా జరిగాయని.. ఇకపై ఇలాంటివి ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి. నా దళితులు అంటూనే డాక్టర్ సుధాకర్ లాంటి ఎంతోమందిని జగన్ పొట్టనపెట్టుకున్నారని, చాలామందిని వేధింపులకు గురిచేశారని విమర్శించారు.

తెలుగుదేశం కార్యకర్తల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇచ్చారు చంద్రబాబు. సభ్యత్వం తీసుకున్నవాళ్లందరికీ బీమా వర్తిస్తుందని.. కొత్త సభ్యత్వం తీసుకొని నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తలకు ప్రస్తుతం బీమా సౌకర్యం అందడం లేదని, అలాంటి వాళ్లను పార్టీ తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading