Download App

పేద కుటుంబాలకు అండగా ‘ఇందిరమ్మ బీమా పథకం’

మే 26, 2026 By Rahul N
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఇందిరమ్మ బీమా పథకం’ను అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల పేద కుటుంబాలకు భద్రత కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలో అనుకోని ప్రమాదాలు, ఆపదలు సంభవించిన సమయంలో బాధిత...
పేద కుటుంబాలకు అండగా ‘ఇందిరమ్మ బీమా పథకం’

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఇందిరమ్మ బీమా పథకం’ను అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల పేద కుటుంబాలకు భద్రత కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కుటుంబంలో అనుకోని ప్రమాదాలు, ఆపదలు సంభవించిన సమయంలో బాధిత కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదం జరిగిన పది రోజుల వ్యవధిలోనే బీమా సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పథకానికి సంబంధించిన రూ.3,509 ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండటం విశేషం. దీంతో పేద కుటుంబాలపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని అధికారులు తెలిపారు.

పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ డిజిటల్ డేటాబేస్, సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నమోదు చేసి, వేగవంతంగా సేవలు అందించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నారు.

పేద కుటుంబాలకు కష్టకాలంలో ఆర్థిక రక్షణ కల్పించే దిశగా ‘ఇందిరమ్మ బీమా పథకం’ కీలక అడుగుగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading