Download App

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్

మే 1, 2026 By Rahul N
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రజలు మోసపోయారని, ప్రభుత్వ విధానాల వల్ల పలు వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని కేటీఆర్...
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్పందన

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రజలు మోసపోయారని, ప్రభుత్వ విధానాల వల్ల పలు వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే, అది తనకు సంతోషంగా ఉందని చెప్పడం బాధాకరమని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఆ విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుంటూ ‘పైశాచిక ఆనందం’ పొందుతున్నానని బహిరంగంగా చెప్పడం సరైన నాయకత్వ లక్షణం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాల్సిందిపోయి, విమర్శలను రాజకీయ కోణంలో తీసుకోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. కాగా, ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading