
చాణక్యుని రాజనీతి ప్రకారం, ఒక బలమైన దేశాన్ని దెబ్బకొట్టడానికి మరియు దానిని లోబరుచుకోవడానికి అనుసరించే ప్రధాన మార్గాలు ఇలా సూచించారు…. ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం (Economic Sabotage) ఒక దేశం బలం దాని ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. శత్రువు దేశంలో అవినీతిని, ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించవచ్చు.
నాయకులను, అధికారులను కొనుగోలు చేసి (Bribery & Subversion) శత్రు దేశంలోని మంత్రులు, సేనాపతులు, మరియు ముఖ్య అధికారులకు లంచాలు ఇచ్చి, వారిని తమ వైపు తిప్పుకోవడం (భేదోపాయం). దీనివల్ల ఆ రాజ్యం లోపలి నుంచే బలహీనపడుతుంది. అంతర్గత కలహాలు సృష్టించడం (Creating Internal Conflicts) ద్వారా ప్రజల మధ్య, కులాల మధ్య లేదా పాలకులకు, సైన్యానికి మధ్య విభేదాలు సృష్టించడం (Dissent) తద్వారా అంతర్గత యుద్ధాలు లేదా తిరుగుబాట్లు వల్ల రాజ్యం సులభంగా కూలిపోతుంది.
గూఢచర్యం (Espionage) చారుల ద్వారా శత్రు దేశంలోని రహస్యాలను, సైనిక బలాన్ని, మరియు వారి బలహీనతలను తెలుసుకోవడం. అదే తన బలంగా మార్చుకోవడం. చాణక్యుని అర్థశాస్త్రంలో గూఢచార వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సహజ మిత్రులను దూరం చేయడం (Isolating Alliances) ద్వారా, ఆ దేశానికి మిత్రదేశాలు లేకుండా చేయడం లేదా వారి మధ్య అనుమానాలు సృష్టించి ఒంటరిని చేయడం. నైతికతను, ధర్మాన్ని భ్రష్టు పట్టించడం వల్ల శత్రు దేశంలోని ప్రజలలో దుర్మార్గం, వ్యసనాలు, మరియు సోమరితనాన్ని పెంచడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇవి “చాణక్యుడు” ముఖ్యంగా సూచించిన మార్గాలు.
భారత దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది… అభివృద్ధి కూడా స్థిరంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇలా ఉన్న భారత దేశంలో ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించడానికి అరాచక శక్తులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు గత వారం రోజుల నుంచి జెన్ జి రూపంలో సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రభంజనంలా దూసుకువస్తుంది. దాని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిద్దాం…
సరికొత్త డిజిటల్ ముప్పు – CJP నేపథ్యం
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అయిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ (CJP). సుప్రీంకోర్టు వ్యాఖ్యలను సాకుగా చూపిస్తూ, కేవలం నాలుగు రోజుల్లోనే లక్షల నుండి మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ పేజీ వెనుక కేవలం యువత ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఉందా? లేక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక బలమైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యూహం ఉందా? అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకుల్లో మొదలైంది. పైకి వ్యంగ్యంగా, సిల్లీగా కనిపించే ఈ బొద్దింకల ఉద్యమం వెనుక ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
4 రోజుల్లో 6 మిలియన్లు – ఇది సహజమైన వృద్ధేనా?
ఒక సాధారణ ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎలాంటి ప్రమోషన్ లేకుండా, కేవలం 4 రోజుల్లో 6 మిలియన్ల (60 లక్షలు) పైగా ఫాలోవర్స్ రావడం డిజిటల్ మార్కెటింగ్ సూత్రాల ప్రకారం దాదాపు అసాధ్యం. దీని వెనుక ఆర్గానిక్ గ్రోత్ (సహజమైన వృద్ధి) కంటే, అత్యాధునిక బోట్ నెట్వర్క్స్ (Bot Networks) మరియు విదేశీ సర్వర్ల నుండి నడిచే అల్గారిథమ్ మానిప్యులేషన్ (Algorithm Manipulation) ఉండే అవకాశం ఎక్కువగా ఉందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి ఒక పక్కా ప్రణాళికతోనే ఈ ఫాలోయింగ్ను సృష్టించారనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది.
రెజీమ్ చేంజ్ (పాలనా మార్పు) వ్యూహం మరియు డీప్ స్టేట్
ప్రపంచవ్యాప్తంగా తమకు లొంగని లేదా స్వతంత్రంగా ఎదిగే దేశాల ప్రభుత్వాన్ని కూల్చడానికి అంతర్జాతీయ డీప్ స్టేట్ (Deep State) ఉపయోగించే ప్రధాన ఆయుధం రెజీమ్ చేంజ్ వ్యూహం. గతంలో ఉక్రెయిన్, ఈజిప్ట్, లిబియా వంటి దేశాలలో ఇలాగే సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న నిరసనలను, ఐరానికల్ గ్రూపులను పెద్ద ఎత్తున లేపి, చివరికి వ్యవస్థలను అస్థిరపరిచారు. ఇప్పుడు భారతదేశంలో కూడా యువతలోని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, అన్-ఆర్గనైజ్డ్ గ్రూపులను (వ్యవస్థీకృతం కాని శక్తులను) రెచ్చగొట్టడం ద్వారా పాలనా మార్పు తీసుకురావాలనే అంతర్జాతీయ కుట్ర ఇందులో దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై దాడి – అంబానీ, అదానీలే టార్గెట్ నా….
ఈ విదేశీ శక్తుల ప్రధాన లక్ష్యం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, భారత ఆర్థిక వెన్నెముకను దెబ్బతీయడం. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అంబానీ, అదానీ వంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలను టార్గెట్ చేయడం ద్వారా, భారతదేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం లేదనే భ్రమను కల్పించాలని చూస్తున్నారు. స్వదేశీ వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటే, దేశ జిడిపి (GDP) దెబ్బతింటుంది, తద్వారా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తులకు సవాలు విసరలేదు అనేది ఈ డీప్ స్టేట్ శక్తుల అసలు ప్లాన్.
అమెరికా లింక్ మరియు అభిజీత్ దీప్కే పాత్ర
ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజీత్ దీప్కే ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉండటం, అక్కడ పబ్లిక్ రిలేషన్స్ (PR) మరియు కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేయడం ఇక్కడ గమనార్హం. విదేశీ గడ్డపై కూర్చుని, అక్కడ లభించే టెక్నాలజీ మరియు నిధుల సహాయంతో భారతదేశంలోని అంతర్గత విషయాలపై ఇలాంటి ‘హైపర్-ఇంటెన్సివ్’ సోషల్ మీడియా లో ప్రచారాన్ని నడపడం వెనుక పశ్చిమ దేశాలలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేదా ఇతర అరాచక సంస్థల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతను “ఆప్ పార్టీ” లో సోషల్ మీడియా ను హ్యాండిల్ చేసేవాడు అని అంటున్నారు. దీని వెనుక ఉన్న కుట్ర ను ఛేదించే పనిలో ప్రభుత్వం ఉంది.
నేటి తరం (Gen Z) పై మానసిక దాడి
నేటి తరం యువత (Gen Z) ఎక్కువగా మీమ్స్, రీల్స్ సంస్కృతికి అలవాటు పడిపోయింది. ఈ బలహీనతను డీప్ స్టేట్ శక్తులు చాలా తెలివిగా వాడుకుంటున్నాయి. దేశభక్తి, జాతీయ బాధ్యత వంటి సీరియస్ విషయాలను హేళన చేస్తూ, “బొద్దింకల సిద్ధాంతం” లాంటి అసంబద్ధమైన (Absurdist) ఆలోచనలను వారి మైండ్లోకి ఎక్కించడం ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థపై గౌరవం పోయేలా చేసి, వారిని డిజిటల్ విప్లవకారులుగా మార్చడమే దీని వెనుక ఉన్న సైకలాజికల్ వార్ఫేర్ లక్ష్యం గా కనపడుతుంది (మానసిక యుద్ధం).
దేశీయ రాజకీయ పార్టీలకు లాభనష్టాలు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం సాధించిన విజయాలను మరుగున పడేస్తూ, నిరంతరం ప్రతికూలతను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింటుంది. తాత్కాలిక లాభం ప్రతిపక్షాలకు ఉండొచ్చు. కాని ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి విపక్షాలు దీనిని వాడుకోవాలని చూస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇలాంటి అరాచక శక్తులు ఏ రాజకీయ పార్టీ నియంత్రణలోనూ ఉండవు. ఇది దేశ భద్రతకే ముప్పు.
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల ద్వంద్వ నీతి
కాక్రోచ్ జనతా పార్టీ వంటి పేజీలు ఇంత వేగంగా పెరగడం వెనుక ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజాల అల్గారిథమ్స్ పాత్ర కూడా ఉంది. భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలకు ఈ ప్లాట్ఫార్మ్లు ఫ్రీ పాస్ ఇస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే భారత ప్రభుత్వం జాతీయ భద్రతను దృష్ట్యా దీనికి సంబంధించిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాల్సి వచ్చింది.
తిప్పికొట్టే ఏకైక ఆయుధం – జాతీయవాదం
ఇలాంటి అంతర్జాతీయ అంతర్గత కుట్రలను, మైండ్ గేమ్స్ను తిప్పికొట్టడానికి మనకు ఉన్న ఏకైక మరియు బలమైన ఆయుధం దేశభక్తి మరియు నేషన్ ఫస్ట్ (దేశమే ప్రథమం) అనే జాతీయవాద భావన. భావప్రకటన స్వేచ్ఛ లేదా వ్యంగ్యం పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను ప్రతి పౌరుడూ గుర్తించాల్సి ఉంది. బాధ్యతాయుతమైన పౌరులు ఈ డిజిటల్ దాడిని, తమ దేశ భక్తి ద్వారానే ఇలాంటి అదృశ్య శక్తుల కుట్రలను చేదించగలం.
ముగింపు – బలమైన భారత్ను ఏమీ చేయలేవు
చివరగా, విదేశాల్లో కూర్చుని బొద్దింకల పేరిట దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసే ఈ డీప్ స్టేట్ శక్తులు ఒక విషయాన్ని గ్రహించాలి. ఆధునిక భారతదేశం ఎటువంటి అంతర్జాతీయ ఒత్తిళ్లనైనా తట్టుకోగల అంతర్గత శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంది. బొద్దింకలే కాదు… పందులు, తోడేళ్లు, గుంటనక్కలు, డేగలు, రాబందులు(ఇవి కొన్ని దేశాలకు గుర్తులు) లాంటి శక్తులన్నీ కట్టకట్టుకుని వచ్చినా, 140 కోట్ల మంది ప్రజల అండ ఉన్న బలమైన భారత్ను, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏమీ చేయలేవు. ఈ ట్రెండ్స్ తాత్కాలికమే కాని, దేశ ప్రగతి శాశ్వతం.
ది ఆర్ట్ ఆఫ్ వార్ ఒక ప్రాచీన చైనీస్ పుస్తకం లో సున్ జు ఈ విధంగా రాశారు. (“Do not repeat the tactics which have gained you one victory, but let your methods be regulated by the infinite variety of circumstances”.) “ఒకసారి గెలుపును అందించిన వ్యూహాన్నే ప్రతిసారీ వాడకూడదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన పద్ధతులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి”.
ఇది ప్రస్తుత “భారత ప్రభుత్వం లోని నాయకులకు తెలిసిన విద్యనే”.
