
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా డీఎంకే నేత Udhayanidhi Stalin ముఖ్యమంత్రి Vijay నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి “రియల్ ప్రభుత్వం” అవసరమని, “రీల్ ప్రభుత్వం” కాదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
విజయ్ ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ లేదని ఉదయనిధి ఆరోపించారు. ప్రస్తుతం తమ కూటమికి చెందిన కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే టీవీకే ప్రభుత్వం నిలబడగలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని కూడా ఆయన ఆరోపించారు.
“ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగాయి. ఇది తమిళనాడు ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును రాజకీయ లావాదేవీలతో మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ ఉదయనిధి మండిపడ్డారు.
అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీశాయి. టీవీకే సభ్యులు డీఎంకే ఆరోపణలను ఖండించగా, సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతరం బలపరీక్ష ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రకటించిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకుని విజయం సాధించింది. అయితే డీఎంకే చేసిన ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
